ఉగ్రవాదుల దాడిలో జవాన్లకు గాయాలు

14 Oct, 2015 16:17 IST|Sakshi

జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.  భద్రతా సిబ్బందిపై బుధవారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కుప్వారా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడి జరిపినట్లు తెలుస్తోంది. గాయపడిన భద్రతా సిబ్బందిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు