ప్రత్యర్థి కంపెనీ దిదిలో ఉబర్ విలీనం!

1 Aug, 2016 13:41 IST|Sakshi
ప్రత్యర్థి కంపెనీ దిదిలో ఉబర్ విలీనం!

చైనాలో రైడ్ షేరింగ్ దిగ్గజాలు ఉబర్, దిది చుక్సింగ్లకు మధ్య నెలకొన్న ప్రచండ యుద్ధానికి తెరపడనుంది. ఉబర్ ఓ మెట్టు దిగొచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్గా ఉన్న చైనా ఆపరేషన్స్ను ఉబర్, తన ప్రత్యర్థి కంపెనీ దిది చుక్సింగ్లో విలీనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విలీన డీల్తో 35 బిలియన్ డాలర్ల(సుమారు రూ.2,33,551 కోట్లు)విలువగా  సంయుక్త కంపెనీ ఆవిర్భవించబోతుందని బ్లూమ్బర్గ్ రిపోర్టు నివేదించింది. ఈ సంయుక్త కంపెనీలో ఉబర్ చైనా ఇన్వెస్టర్లు 20 శాతం స్టాక్ ను పొందనున్నట్టు తెలిపింది. ఈ కొత్త డీల్తో ఉబర్లో దిది చుక్సింగ్ ఒక బిలియన్ డాలర్లను( సుమారు రూ.6,673 కోట్లను) పెట్టుబడులుగా పెట్టనుందని బ్లూమ్ బర్గ్ నివేదించింది..


చైనాలో ఉబర్కు ఎదురవుతున్న భారీ నష్టాలను తొలగించుకోవడానికి ఆ సంస్థ ఈ మేరకు పావులు కదుపుతుందని బ్లూమ్ బర్గ్ రిపోర్టు తెలిపింది. భవిష్యత్తులో తమ మనుగడును కొనసాగించడానికి ఈ డీల్ సాయపడనుందని ఉబర్ భావిస్తున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన నేడు(సోమవారం) వెలువడే అవకాశముందుని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే ఈ రిపోర్టులపై ఉబర్, దిది చుక్సింగ్ కంపెనీల అధికార ప్రతినిధులు వెంటనే స్పందించడానికి నిరాకరించారు. చైనా మార్కెట్ షేరును దక్కించుకోవడానికి, ఆధిపత్య స్థానంలో కొనసాగడానికి ఈ రెండు సంస్థలు బిలియన్ డాలర్లను డ్రైవర్లకు, ప్యాసెంజర్ల సబ్సిడీల కోసం వెచ్చిస్తూ ఉన్నాయి.

చైనా రైడ్ షేరింగ్ మార్కెట్ లో 90శాతం స్థానాన్ని దిది సొంత చేసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. గత నెలే ఈ కంపెనీలో యాపిల్ ఇంక్ వంద కోట్ల డాలర్లను పెట్టుబడులుగా కూడా పెట్టింది.  50 దేశాలకు పైగా విస్తరించిన ఉబర్, అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తోంది. అయితే ఈ కంపెనీ చాలా ప్రాంతాల్లో రెగ్యులేటరీ నిబంధనను, టాక్సీ ఆపరేటర్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  ఈ రిపోర్టులు వెలువడిన వెంటనే రైడ్ షేరింగ్పై కొత్త నిబంధనలు విధిస్తూ చైనీస్ అథారిటీలు  ప్రకటన విడుదల చేశారు. తక్కువ ధరలకు రైడ్ షేరింగ్ ఆపరేట్ చేయడంపై నిషేధం, సబ్సిడీలు ఆఫర్లపై పరిమితులను ఈ నిబంధనలు విధించాయి.

మరిన్ని వార్తలు