మెటర్నిటీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

11 Aug, 2016 18:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సవరణ బిల్లును గురువారం రాజ్యసభలో ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లుపై చర్చించిన రాజ్యసభ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటికే కేబినేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు శీతాకాల సమావేశాల్లోనే లోక్ సభలో ఆమోదానికి వెళ్లే అవకాశం ఉంది.

బిల్లుతో లాభాలు:

1. మెటర్నిటీ లీవ్ కింద ఇప్పటివరకూ అమల్లోవున్న 12వారాల సెలవు పరిమితి 26వారాలకు పెరగనుంది.

2. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పనిచేస్తున్న మహిళలకు ఈ బిల్లు వర్తిస్తుంది.

3. ఇద్దరూ లేదా ఎక్కువ మంది పిల్లలు ఉన్న మహిళలకు ఈ సెలవు దినాలు వర్తించవు.

4. ఇంటి నుంచి పనిచేసే మహిళలకు కూడా వర్తించే విధంగా బిల్లును సవరించారు.

>
మరిన్ని వార్తలు