‘విద్యావిధానంలో సంస్కరణలు రావాలి’

17 Mar, 2023 06:52 IST|Sakshi
మాట్లాడుతున్న వీసీ వెంకటరమణ

భైంసా(ముధోల్‌): విద్యావిధానంలో సంస్కరణలు రావాలని బాసర ట్రిపుల్‌ఐటీ వీసీ, ప్రొఫెసర్‌ వెంకటరమణ అన్నారు. గురువారం ‘ఉన్నతవిద్యలో నూతన సంస్కరణలు’ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల మేధోమథనం సదస్సుకు హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయి సంస్థలను సృష్టించాలని, 2035 నాటికి స్థూల నమోదు నిష్పత్తి కనీసం 50శాతానికి పెంచాలన్నారు. ఉన్నత విద్యలో నూతన దృష్టితో కూడిన విద్యావనరులను బహుభాషా విషయ(మల్టీ డిసిప్లినరీ) సంస్థలతో నిర్వహించాలన్నారు. టీ హబ్‌ సహకారంతో ఆర్జీయూకేటీలో చేస్తున్న సాంకేతిక కసరత్తును వివరించారు.

మరిన్ని వార్తలు