పండుగ కోసం బట్టలు కొనేందుకు వెళ్లి.. విషాదం!

23 Oct, 2023 09:06 IST|Sakshi
నగేశ్‌ (ఫైల్‌)

సాక్షి, ఆదిలాబాద్‌: దసరా సందర్భంగా షాపింగ్‌ చేసి తిరిగి వస్తుండగా యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సోన్‌ మండలం గల 44 జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సంతోషం రవీందర్‌ కథనం ప్రకారం.. మండలంలోని పాక్‌పట్ల గ్రామానికి చెందిన ఆర్మూర్‌ నగేశ్‌ (22) దసరా పండగ కోసం బట్టలు కొనేందుకు ఆదివారం బైక్‌పై నిర్మల్‌ వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కంటెయినర్‌ డ్రైవర్‌ వేగంగా వెనుక వైపు నుంచి బైక్‌ను ఢీకొట్టారు. కిందపడిన నగేశ్‌ తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి బోయవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు