ఏపీలో కొత్తగా 667 కరోనా కేసులు

6 Dec, 2020 18:55 IST|Sakshi

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 60,329 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 667 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 87,1972కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి క్షేమంగా కోలుకుని 914 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8,59,029 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. (చదవండి: దేశంలో తగ్గుతున్న కరోనా కొత్త కేసులు)

గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, వైఎస్సార్‌ కడప, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది మరణించగా, ఇప్పటి రాష్ట్రంలో 7,033 మంది మృతిచెందారు. ఏపీలో ప్రస్తుతం 5,910 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,04,10,612 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. (చదవండి: కోటిన్నర మంది చనిపోయినా... ఒక్క టీకా పడలేదు

మరిన్ని వార్తలు