సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాల వైద్యాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా డీఎంహెచ్వోగా కేసీ చంద్రనాయక్ బాధ్యతలు చేపట్టనుండగా, పీఎస్ సూర్యనారాయణ విశాఖ జిల్లా వైద్యాధికారిగా బదిలీ అయ్యారు. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా డీఎంహెచ్వోగా కేవీఎస్ గౌరేశ్వరరావు, కృష్ణా జిల్లాకు ఎం.సుహాసిని, ప్రకాశం జిల్లాకు పి.రత్నవళి, చిత్తూరు జిల్లాకు ఎం.పెంచలయ్య(ఇంఛార్జి) డీఎంహెచ్ఓలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. (చదవండి: ఏపీ ఐసెట్–2020 ఫలితాల వెల్లడి)