నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం!

28 Aug, 2021 08:57 IST|Sakshi

2 రోజులు రాష్ట్రంలో వర్షాలు

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ బెంగాల్‌ తీరానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శనివారం (నేడు) వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

చదవండి: ఏపీలో తక్కువ వ్యయంతో సరుకు రవాణా 

శనివారం విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, ఆదివారం విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో గారలో 11.8 సెంటీమీటర్లు, గుమ్మలక్ష్మీపురంలో 8.3, కళింగపట్నంలో 8.0, పాలకొండలో 7.9, ఇంకొల్లులో 7.5, శ్రీకాకుళంలో 7.0, నూజెండ్లలో 6.4, కురుపాంలో 5.8, సీతంపేట, అద్దంకి, వేటపాలెంలో 5.1, మద్దిపాడులో 5.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

చదవండి: కేసులు వేసే అధికారం ఈఓ, ఏసీలకు..

మరిన్ని వార్తలు