మంత్రి గుమ్మనూరు జయరాంకు మాతృవియోగం

8 Oct, 2023 08:26 IST|Sakshi

సాక్షి, కర్నూలు: మంత్రి గుమ్మనూరు జయరాం ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆలూరులో ఆయన మాతృమూర్తి శారదమ్మ(79) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గతంలో 'గుమ్మనూరు' గ్రామ సర్పంచ్ గా ఆమె సేవలందించారు.

ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం, వారి స్వగ్రామమైన గుమ్మనూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గుమ్మనూరు జయరాం కుటుంబం శోక సంద్రంలో మునిగింది.
చదవండి: మంత్రి రోజాకు మద్దతుగా మీనా.. బండారుపై కోర్టు చర్యలు తీసుకోవాలని..

మరిన్ని వార్తలు