దారి మళ్లించేందుకే అవాస్తవాలు ప్రచారం

12 Sep, 2023 03:59 IST|Sakshi

పక్కా ఆధారాలతోనే కేసు దర్యాప్తు

స్పష్టం చేసిన సీఐడీ వర్గాలు 

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొ­రేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో పూర్తి ఆధారాలతోనే కేసు నమోదు చేసి మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ వర్గా­లు పేర్కొన్నాయి. ఈ కేసు దర్యాప్తు ప్రక్రి­య­లో అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌ వాంగ్మూలం కేవలం ఒక భాగం మాత్ర­మేనని  స్పష్టం చేశా­యి.అన్ని కోణాల్లో పరిశోదించి పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించాయి. తన వాంగ్మూ­లంతోనే చంద్ర­బాబును సిట్‌ అరెస్టు చేశారని చెప్పడం హాస్యా­స్ప­ద­మని, పూర్తిగా ఫైళ్లు చూడ­కుండా ఆయన్ని ఎలా అరెస్ట్‌ చేస్తారని, తాను అప్రూవర్‌గా మారలేదని పీవీ రమేశ్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలను సీఐడీ వర్గాలు ఖండించాయి.

 సిట్‌ విచార­ణను ప్రభావితం చేసే ఉద్దే­శంతో ఆయన అవాస్తవాలను ప్రచా­రంలోకి తెస్తున్నా­రని పేర్కొంది. నిబంధన­లకు విరు­ద్ధంగా డిజైన్‌ టెక్‌ కంపెనీకి ప్రభుత్వ నిధులు మంజూరు చేయడాన్ని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత అభ్యంతరం తెలిపా­రని సిట్‌ వర్గాలు వెల్లడించాయి.ఆమె అభ్యంతరా­లను బేఖాతర్‌ చేస్తూ చంద్రబాబు ఆదేశా­లతో నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంటూ పీవీ రమేశ్‌ డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశారని సిట్‌ తెలిపింది.

అధికార దుర్వినియోగానికి పాల్ప­డి రూ.371 కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించినట్లు దర్యాప్తులో ఆధారాలతో సహా నిర్ధా­రణ అయ్యిందని పేర్కొంది.దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో పీవీ రమేశ్‌ ఉద్దేశపూ­ర్వకంగానే మీడియా ద్వారా అవాస్త­వా­లను ప్రచారంలోకి తెస్తున్నారని సిట్‌ స్పష్టం చేసింది. ప్రజల్ని అయోమయానికి గురి చేయడంతో­పాటు దర్యాప్తును తప్పుదారి పట్టించాల­న్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యా­­నించింది.

 పీవీ రమేశ్‌ చెబుతు­న్న­ట్లుగా హాస్యా­స్పదంగానో పేలవంగానో ఈ కేసును దర్యాప్తు చేయడం లేదని సిట్‌ పేర్కొంది. పక్కా ఆధా­రాలతో నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నందునే చంద్రబాబు అరెస్ట్‌ను న్యాయ­స్థానం సమ­ర్థించి ఆయనకు రిమాండ్‌ కూడా విధించిందని సీఐడీ వర్గాలు తెలిపాయి.
 

మరిన్ని వార్తలు