సాక్షి, విశాఖపట్నం: ఒక ఇంట్లో కవలలు ఉంటేనే ఆ సందడే వేరు. మరి అలాంటిది కవలలంతా ఒకే చోట చేరితే ఎలా ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే విశాఖపట్నం బీచ్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. నగరంలోని పలువురు ట్విన్స్ సోమవారం ఓ హోటల్లో ప్రపంచ ట్విన్స్ డేను ఘనంగా నిర్వహించారు. వారి అనుభూతులను ఒకరినొకరు పంచుకున్నారు. అనంతరం ఆట పాటలతో సందడి చేశారు. 25 మంది జతల కవలలు వాట్సప్ గ్రూఫ్లో ఉండడం వల్ల వీరంతా ఒక దగ్గర కలవగలిగారు.