అమరావతి: పంచారామ క్షేత్రాలలో ప్రథమారామక్షేత్రమైన అమరావతి అమరేశ్వరునికి ఈనెల 14వ తేదీ నుంచి పచ్చ కర్పూరంతో కూడిన శుద్ధజలాలతో అభిషేకం నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి వేమూరి గోపినాథశర్మ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గర్భాలయంలోని అమరేశ్వరుని శివలింగాకారాన్ని కాపాడుకోవటానికి శుద్ధ జలంతో మాత్రమే అభిషేకం చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆలయ ప్రకారంలో దక్షిణం వైపు ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో అమరేశ్వరస్వామివారి చరలింగాన్ని ఉంచి భక్తులు తెచ్చిన ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు.