బెట్టను తట్టుకునే పంటలనే సాగు చేయండి | Sakshi
Sakshi News home page

బెట్టను తట్టుకునే పంటలనే సాగు చేయండి

Published Sun, Nov 12 2023 1:52 AM

ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన 
కల్పిస్తున్న సిబ్బంది  - Sakshi

డీపీఎం డి.వాణిశ్రీ

దగ్గుబాడు (కారంచేడు): వర్షాభావ పరిస్థితుల్లోనూ బెట్టను తట్టుకునే పంటలనే సాగు చేయాలని డీపీఎం డి.వాణిశ్రీ సూచించారు. మండలంలోని దగ్గుబాడులో శనివారం ఆమె ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో రైతులతో మాట్లాడారు. బెట్టను తట్టుకొనే కంది, ఆముదం, జొన్న, దోస, ఆవాలు, చిక్కుడు వంటి పంటల్ని సాగుచేసుకోవాలని ఆమె సూచించారు. చిక్కుడు ఎటు చూసినా మూడు అడుగుల దూరంలో ఒక పాదులో కంది, జొన్న, దోస, ఆవాలు వంటి పంటలను సాగు చేసుకోవాలని తెలిపారు. దీనివల్ల కరువు పరిస్థితుల్లోనూ పంటల్ని నష్టపోకుండా ఆదాయం పొందే వీలుంటుందని చెప్పారు. పాదులు తీసుకునే విధానాన్ని క్షేత్రస్థాయిలో వివరించారు. కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌చార్జి యు. శివకుమార్‌, ఐసీపీఎస్‌ కె. అర్చన, టి.అనిల్‌, కె.కవిత, జి.అనిల్‌కుమార్‌, రైతులు సీహెచ్‌. లాజరస్‌, కె.బాజి, ఎం. శ్రీనివాసరావు, పి.హనుమంతరావు, ఎస్‌కే మస్తాన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement