నెలవారీ డేటా వినియోగం
ప్రతి స్మార్ట్ఫోన్కు 40 జీబీ
దేశీయంగా 2026 నాటికి అంచనా
ఎరిక్సన్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెలికం సేవలకు సంబంధించి యూజర్ల సంఖ్య 2026 నాటికి 33 కోట్లకు చేరే అవకాశం ఉంది. అలాగే ప్రతీ స్మార్ట్ఫోన్పై నెలవారీగా డేటా వినియోగం మూడు రెట్లు ఎగిసి 40 గిగాబైట్లకు (జీబీ) చేరనుంది. టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ బుధవారం ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం నెలవారీ ప్రతీ స్మార్ట్ఫోన్పై సగటు వినియోగం 14.6 జీబీగా ఉంటోంది. తద్వారా అత్యధిక డేటా వినియోగంలో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ‘‘భారత్ ప్రాంతంలో 4జీ సబ్స్క్రిప్షన్లు 2020లో 68 కోట్లుగా ఉండగా 2026 నాటికి 83 కోట్లకు చేరతాయని అంచనా. 2026 ఆఖరు నాటికి భారత్లో మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్లలో 5జీ కనెక్షన్లు 26 శాతంగా దాకా .. అంటే సుమారు 33 కోట్ల స్థాయిలో ఉండవచ్చు’’ అని ఎరిక్సన్ నివేదికలో పేర్కొంది.
5జీపై మెట్రోల్లో ఆసక్తి..
మెగా, మెట్రో నగరాల్లో ప్రస్తుతం ఇంటి ఇంటర్నెట్ కనెక్షన్ కోసం కేవలం 4జీపైనే ఆధారపడుతున్న వారిలో దాదాపు 42 శాతం మంది .. 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ కనెక్షన్లపై ఆసక్తిగా ఉన్నట్లు ఎరిక్సన్ ఇండియా హెడ్ నితిన్ బన్సల్ తెలిపారు. ‘‘5జీ కనెక్టివిటీకి కేవలం 10 శాతం అధికం చెల్లించాల్సి రావచ్చు. అయితే, బండిల్డ్ డిజిటల్ సర్వీసులు కూడా లభిస్తే 5జీ కోసం 50 శాతం ఎక్కువైనా చెల్లించేందుకు భారత్లో 50 శాతం మంది వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. 5జీ అందుబాటులోకి వచ్చిన తొలి ఏడాదిలో 4 కోట్ల మంది యూజర్లు కనెక్షన్ తీసుకునే అవకాశం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
నివేదికలోని మరిన్ని విశేషాలు..