అందరికీ ఆమోదయోగ్యంగా ఈ కామర్స్‌ పాలసీ: గోయల్‌

4 Oct, 2021 00:11 IST|Sakshi

దుబాయి: ప్రతిపాదిత ఈకామర్స్‌ విధానం పటిష్టంగా, ప్రతి భారతీయుని ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ హామీ ఇచ్చారు. భాగస్వాముల ప్రయోజనాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ముసాయిదా ఈ కామర్స్‌ నిబంధనలపై అభిప్రాయాలను తాను ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. ముసాయిదా నిబంధనలపై అంతర్గత మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు అవసరం లేదన్నారు. డీపీఐఐటీ, కార్పొరేట్‌ శాఖ, నీతి ఆయోగ్‌ కొన్ని నిబంధనల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. దుబాయిలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచి్చన సందర్భంగా మంత్రి గోయల్‌ మాట్లాడారు.  

మరిన్ని వార్తలు