తన ప్లాట్ ఫారంలోని వినియోగదారులకు అంతరాయం లేని అనుభవాన్ని అందించడానికి వాట్సప్ యూపీఐ సేవలను కూడా అందిస్తుంది. ఈ యూపీఐ సేవల వల్ల వాట్సాప్ యాప్ నుంచి ఇతరులకు నేరుగా డబ్బును బదిలీ చేయవచ్చు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ 2018లో భారతదేశంలో ఈ ఫీచర్ ట్రయల్ రన్ చేసింది. ఆ తరువాత 2020లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ) ఆమోదం తర్వాత విడుదల చేసింది. ఈ యాప్ 227కు పైగా బ్యాంకుల సేవలను అందిస్తుంది. యూజర్లు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. అలాగే, యుపీఐ పిన్ కూడా మార్చవచ్చు.
వాట్సాప్లో యూపీఐ పిన్ ఎలా మార్చాలి..?