హోరెత్తుతున్న ఐటీ రిట‌ర్న్స్‌..గంటలోనే 4లక్షల మంది దాఖలు!

31 Jul, 2022 21:33 IST|Sakshi

గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నుల దాఖలుకు మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో పన్ను చెల్లింపు దారులు అప‍్రమత్తమయ్యి రికార్డ్‌ స్థాయిలో ఐటీ రిటర్న్‌ దాఖలు చేసినట్లు ఇన్‌ ట్యాక్స్‌ అధికారులు తెలిపారు. 

దీంతో ఆదివారం సాయంత్రం 6గంటల వరకు మొత్తం 44,99,038 మంది ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయగా.. 5నుంచి 6గంటల మధ్యలో సుమారు 5,17,030 ఐటీఆర్‌ దాఖలు చేశారని ట్వీట్‌ చేసింది

ఆదివారం సాయంత్రం 8.50 గంటలకు మొత‍్తం 53,98,348లక్షల మంది ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయగా చివరి గంటలో అంటే 7.50 నుంచి 8.50 మధ్యలో సుమారు 4,95,505మంది ఐటీ రిటర్న్‌ దాఖలు చేసినట్లు ట్విట్‌లో పేర్కొంది. 

మరిన్ని వార్తలు