ఐఓబీ ఎండీ, సీఈఓగా అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ

2 Jan, 2023 17:02 IST|Sakshi

చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) మేనేజింగ్‌ డైరెక్టర్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (ఎండీ, సీఈఓ) అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవను కేంద్రం నియమించింది.

2023 జనవరి 1వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఐఓబీ చీఫ్‌ డైరెక్టర్‌గా శ్రీవాస్తవ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో ఆయనకు దాదాపు 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. 

చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్‌.. నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేర్‌ చేస్తే పైసలు కట్టాలి!

మరిన్ని వార్తలు