రెండు కంపెనీలకు ఐఎస్‌పీ లైసెన్స్‌

11 Nov, 2023 04:28 IST|Sakshi

న్యూఢిల్లీ: జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్, భారతి గ్రూప్‌ ప్రమోట్‌ చేస్తున్న వన్‌వెబ్‌ తాజాగా టెలికం శాఖ నుంచి ఇంటర్నెట్‌ సరీ్వస్‌ ప్రొవైడర్‌ (ఐఎస్‌పీ)  లైసెన్స్‌ అందుకున్నట్టు సమాచారం.

శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలను అందించేందుకు ఈ రెండు సంస్థలకు ఏడాది క్రితమే అనుమతులు లభించాయి. ఈ కంపెనీలు టెరెస్ట్రియల్‌ నెట్‌వర్క్‌లతో లేదా వీశాట్‌ ద్వారా శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలను  అందించవచ్చని ఒక అధికారి తెలిపారు.   
 

మరిన్ని వార్తలు