భారత్‌లో లెక్సస్‌ ఇండియా లగ్జరీ కార్‌ డెలవరీ ప్రారంభం

30 Jun, 2023 21:03 IST|Sakshi

జపాన్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్‌ తాజాగా భారత్‌లో కొత్త ఐదవ తరం ఐదు సీట్ల ఆర్‌ఎక్స్‌ 350 హెచ్‌ (RX 350H) లగ్జరీ ఎస్‌యూవీ డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త మోడల్‌ను జపాన్‌ సంస్థ లెక్సస్‌ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో - 2023 ఈవెంట్‌లో ప్రదర్శనకు పెట్టింది. తాజాగా ఈ లగ్జరీ కార్‌లను కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు లెక్సస్‌ ఇండియా తెలిపింది. 

ఇక, చూపరులను ఆకట్టుకునే విధంగా డిజైన్‌ చేయడంలో లెక్సస్‌ ప్రసిద్ధి చెందింది. ఆ అంచనాలతో ఎక్స్‌ 350 కారును సైతం డిజైన్‌ చేసింది. ముఖ్యంగా స్కల్ప్టెడ్ లైన్, ఎల్‌ఈడీ ఇల్యూమినేషన్, బోల్డ్, ఐకానిక్ యాక్సెంట్‌లతో మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. 

ఇందులో అత్యాధునికమైన ఎలక్ట్రిఫైడ్ టెక్నాలజీని దాని అసాధారణమైన ఫీచర్లతో భారత ఆటోమొబైల్‌ రంగంలో ఉన్న విదేశీ ఆటోమొబైల్‌ కంపెనీల జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.

లెక్సస్‌ ఆర్‌ఎక్స్‌ డ్రైవర్ కాక్‌పిట్ డిజైన్‌తో హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, మల్టీమీడియా డిస్‌ప్లే సౌలభ్యాన్ని కలిగి ఉంది.ఈ కార్‌ ధర రూ.95.80లక్షలు. లెక్సస్ ఇండియా మొత్తం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్ఎక్స్‌ డిమాండ్‌ని సాధించింది. 

మరిన్ని వార్తలు