న్యూఢిల్లీ: డిజిటల్గా మరింత బలోపేతం అయ్యే లక్ష్యంతో బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ ‘డిజిజోన్’ను ప్రారంభించింది. ‘‘టెక్నాలజీ ఆధారిత జీవిత బీమా సంస్థగా అవతరించలాన్న ఉద్దేశ్యంతో.. ఎల్ఐసీ తన ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన డిజిజోన్ కియోస్క్ల ద్వారా అందిస్తుంది’’ అని ఎల్ఐసీ ప్రకటించింది. డిజిజోన్ సేవలను వినియోగించుకోవడం ద్వారా పాలసీలను ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవడంతోపాటు, ప్రీమియం చెల్లించొచ్చని సూచించింది.