సెలెరియోలో సరికొత్త టెక్నాలజీ.. బుకింగ్స్‌ ప్రారంభం

3 Nov, 2021 08:10 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ సెలెరియో కొత్త వర్షన్‌ ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభించింది. వినియోగదార్లు రూ.11,000 చెల్లించి ఈ వాహనాన్ని బుక్‌ చేయవచ్చు. స్టార్ట్‌–స్టాప్‌ టెక్నాలజీతో తదుపరి తరం కె–సిరీస్‌ ఇంజన్‌ పొందుపరిచారు.

ఆటో గేర్‌ షిఫ్ట్‌ టెక్నాలజీతో ఇప్పటికే ఈ కారు ఆదరణ చూరగొందని కంపెనీ తెలిపింది. భారత్‌లో అత్యంత ఇంధన సామర్థ్యం గల పెట్రోల్‌ కారుగా సెలెరియో నిలవనుందని మారుతి సుజుకి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ సి.వి.రమణ్‌ తెలిపారు.
 

మరిన్ని వార్తలు