StockMarketOpening: మెటల్‌ షైన్‌, లాభాల జోరు

27 Oct, 2022 09:52 IST|Sakshi

సాక్షి,ముంబై:దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య భారతీయ షేర్ మార్కెట్ సానుకూలంగా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 394 పాయింట్లు ఎగిసి 59939 వద్ద,  నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 17775 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు నెలవారీ F&O గడువు  ముగియనుంది.  దీంతో ట్రేడర్ల అప్రమత్తత కొనసాగే అవకాశం ఉంది. 

దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా మెటల్‌ రంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్, ​జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్,  టాటా స్టీల్  లాభపడుతుండగా, ఎన్‌టిపిసి, ఇన్ఫోసిస్, ఒఎన్‌జిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్  హెచ్‌డిఎఫ్‌సి లైఫ్  నష్టాల్లో ఉన్నాయి.  కాగా  బలిప్రతిపాద సందర్భంగా బీఎస్‌ఈ, ఎన్‌సీఈ మార్కెట్లకు  బుధవారం సెలవు.
 

మరిన్ని వార్తలు