స్వల్ప నష్టాల ముగింపు
విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల ప్రభావం
ముంబై: దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడంతో స్టాక్ సూచీల 3 రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. ఆసియా, యూరప్ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించారు. ట్రేడింగ్లో 383 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరికి 16 పాయింట్ల స్వల్ప నష్టంతో 64,942 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 94 పాయింట్ల పరిధిలో కదలాడింది. ఆఖరికి ఐదు పాయింట్ల నష్టంతో 19,407 వద్ద నిలిచింది. చైనా అక్టోబర్ ఎగుమతులు భారీగా క్షీణించినట్లు డేటా వెల్లడికావడంతో ఆసియాలో ఒక్క తైవాన్ తప్ప మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు 2% నష్టపోయాయి. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన, ఇంధన షేర్ల పతనంతో యూరప్ మార్కెట్లు ఒకశాతం మేర పతనమయ్యాయి.