మార్కెట్ లోకి మరో బడ్జెట్ గేమింగ్ ఫోన్

6 Dec, 2020 12:00 IST|Sakshi

చైనాకు చెందిన ట్రాన్స్‌షన్ హోల్డింగ్స్ యాజమాన్యంలోని టెక్నో బ్రాండ్ ఇటీవల టెక్నో పోవా సరికొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసారు. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ముఖ్యంగా గేమింగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని 128జీబీ. ఈ ఫోన్ ఇప్పటికే నైజీరియా, ఫిలిప్పీన్స్‌తో సహా కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ దేశంలోని ఇతర బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లైన షియోమికి చెందిన రెడ్‌మి 9 మరియు రియల్‌మీ నార్జో 20లతో పోటీ పడగలదని ఆశిస్తోంది. ఈ మొబైల్ లో క్వాడ్ రియర్ కెమెరా6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మరియు మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్తో వచ్చింది. (చదవండి: 600 మెగా పిక్సెల్ కెమెరాతో శామ్‌సంగ్)

టెక్నో పోవా ఫీచర్స్ 
ఇందులో 6.8 అంగుళాల హెచ్‌డీ+డాట్-ఇన్ డిస్ ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720×1640 పిక్సెల్స్‌గా ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్ తో పనిచేయనుంది. 4జీబీ + 6 జీబీ ర్యామ్, 64జీబీ+128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. టెక్నో పోవాలో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీంతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉండనున్నాయి. దీంతో పాటు మరో ఏఐ లెన్స్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత హైఓఎస్ 7ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. మ్యాజిక్ బ్లూ, స్పీడ్ పర్పుల్, డాజిల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. కనెక్టివిటీ కోసం వై-ఫై, ఎల్‌టిఇ, జిపిఎస్, బ్లూటూత్ ఉన్నాయి. దీనిలో ఎఫ్‌ఎం రేడియో సపోర్ట్ కూడా ఉంది. భారతదేశంలో టెక్నో పోవా ధర రూ. బేస్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 9,999 ఉండగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 11,999. ఈ ఫోన్ డిసెంబర్ 11న మధ్యాహ్నం ఫ్లిప్ కార్ట్ లో మొదటి సేల్ కు రానుంది.
 

మరిన్ని వార్తలు