సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

7 Dec, 2023 15:49 IST|Sakshi

గత కొన్ని రోజులుగా వరుస లాభాల్లో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు ఉదయం నుంచి నష్టాల బాట పట్టి, ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిసాయి. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 132.04 పాయింట్ల నష్టంతో 69521 వద్ద, నిఫ్టీ 36.55 పాయింట్ల నష్టంతో 20901.15 వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, అల్ట్రా టెక్ సిమెంట్, సిప్లా, టైటాన్ కంపెనీ నిలిచాయి. భారతి ఎయిర్‌టెల్, హిందూస్తాన్ యూనీలీవర్ (HUL), అపోలో హాస్పిటల్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), టాటా స్టీల్ కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

>
మరిన్ని వార్తలు