సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన దేశీయ సూచీలు

8 Dec, 2023 09:33 IST|Sakshi

నిన్న నష్టాల్లో ప్రారంభమై నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 144.69 పాయింట్ల లాభంతో 69666.38 పాయింట్ల వద్ద, నిఫ్టీ 32.90 పాయింట్ల లాభంతో 20934.10 వద్ద ముందుకు సాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, అపోలో టైర్స్, ఎల్ఐసీ హోసింగ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు చేరగా.. ఐసీఐసీఐ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) వంటివి నష్టాల్లో సాగుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

>
మరిన్ని వార్తలు