ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ విభాగంలోకి విప్రో!

15 Jul, 2022 07:42 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం విప్రో కంజ్యూమర్‌ కేర్, లైటింగ్‌ తాజాగా ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ వ్యాపారంలోకి ప్రవేశించింది. చిరుతిళ్లు, మసాలా దినుసులు, రెడీ టు ఈట్‌ విభాగంలో సుస్థిర స్థానం సంపాదించాలన్నది సంస్థ లక్ష్యం. 

కాగా, సంతూర్, యార్డ్‌లీ, చంద్రిక, గ్లూకోవిట, సేఫ్‌వాష్‌ వంటి బ్రాండ్లను సంస్థ ప్రమోట్‌ చేస్తోంది. ఇప్పటికే కంపెనీ తన ఉత్పత్తులను ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య మార్కెట్లలో విక్రయిస్తోంది. 2021–22లో విప్రో కంజ్యూమర్‌ కేర్‌ రూ.8,634 కోట్ల టర్నోవర్‌ సాధిచింది.   


 

మరిన్ని వార్తలు