యశవంతపుర: మంగళూరు విమానాశ్రయంలో రెండు కేసుల్లో రూ.61 లక్షలు విలువైన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. కేరళ కాసరగోడుకు చెందిన అబ్దుల్ రషీద్, అబ్దుల్ నిషాద్లు ఈ నెల 23న విదేశాల నుంచి చాటుగా బంగారం తీసుకొచ్చి విమానాశ్రయం మరుగుదొడ్డిలో దాచారు. దీనిని గుర్తించి కస్టమ్స్ అధికారులు అబ్దుల్ రషీద్ దాచిన 638 గ్రాముల బంగారం, నిషాద్ దాచిన 629 గ్రాముల బంగారం బిస్కెట్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
బెంగళూరులో...
బెంగళూరులో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఖుర్షీద్(41, ఉత్తరప్రదేశ్)ను అరెస్ట్ చేసి రూ. 61.50 లక్షల విలువైన బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు.