తిరుమల మెట్లెక్కుతూ బీటెక్‌ విద్యార్థి మృతి

28 Feb, 2021 08:55 IST|Sakshi
రాహుల్‌ (ఫైల్‌)

తిరుమల: శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడకమార్గంలో తిరుమలకు వస్తున్న భక్తుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన బీటెక్‌ విద్యార్ధి రాహుల్‌ కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనార్ధం కాలినడకన తిరుమలకు బయలుదేరాడు. గాలిగోపురం వద్ద ఆయాసం రావడంతో శ్వాస ఆడలేదు. టీటీడీ సిబ్బంది ప్రథమ చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఊపిరి అందక రాహుల్‌ మృతి చెందాడు.
చదవండి:
వివాహేతర సంబంధం: తండ్రీ కొడుకుల ఆత్మహత్య   
ఎక్స్‌లేటర్‌పై కాలుతీసి బ్రేక్‌పై మోపడంతో... 

మరిన్ని వార్తలు