స్నేహితుడి ఎదుటే విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌

15 Jan, 2023 06:30 IST|Sakshi

కాంచీపురం: కళాశాల విద్యార్థినిని బెదిరించి ఆమె స్నేహితుడి ఎదుటే ఐదుగురు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.  ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురం సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బెంగళూరు–పుదుచ్చేరి రహదారి పక్కనున్న ప్రైవేట్‌ స్కూల్‌ ఆవరణలో బాధితురాలు తన స్నేహితుడితో మాట్లాడుతోంది.

అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఐదుగురు వ్యక్తులు వారిని ముట్టడించారు. చంపుతామని బెదిరిస్తూ స్నేహితుడు చూస్తుండగానే ఆ విద్యార్థినిపై అత్యాచారానికి వడిగట్టారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని బాధితురాలు, ఆమె స్నేహితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు