కార్వీ కేసు: రంగంలోకి దిగిన ఈడీ

6 Sep, 2021 11:19 IST|Sakshi

పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసిన ఈడీ

సాక్షి, హైదరాబాద్‌: కార్వీ కేసులో  ఈడీ రంగంలోకి దిగింది. పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసింది. సీసీఎస్‌ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా కార్వీపై అధికారులు కేసు నమోదు చేశారు. కార్వీ ఎండీ పార్థసారథిని 7 రోజుల కస్టడీని ఈడీ కోరింది. జ్యుడిషియల్ కస్టడీలో మూడు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. మనీ లాండరింగ్‌పై కార్వీ ఛైర్మన్‌ను ఈడీ విచారించనుంది. కస్టమర్స్ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే అంశంపై  ఈడీ విచారణ చేపట్టనుంది. బ్యాంకు రుణాల నగదు విదేశాలకు తరలించారని అధికారులు అనుమానిస్తున్నారు.

ఇవీ చదవండి:
Bigg Boss: బాస్‌లకే బాస్‌ అసలైన బిగ్‌బాస్‌ ఇతనే 
కోకాపేట: కొండలెట్లా కరుగుతున్నయంటే..

మరిన్ని వార్తలు