ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన భార్యపై భర్త దాడి

16 Dec, 2021 07:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హోసూరు(కర్ణాటక): దొంగచాటున ప్రియున్ని కలిసేందుకెళ్లిన భార్యపై దాడి చేసిన భర్తను సిప్‌కాట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అసోం లక్కిపూర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన భర్యతో కలిసి హోసూరు పారిశ్రామికవాడ బ్యాడరపల్లిలో నివాసముంటున్నారు.

ఆ మహిళకు ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. మంగళవారం ఉదయం ప్రియున్ని వెతుక్కొంటూ వెళ్లిన భార్యను భర్త వెంబడించి ఆమెను తీవ్రంగా కొట్టడంతో గాయపడింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తను అరెస్ట్‌ చేశారు.   

చదవండి: శివసేనపై హోంమంత్రి ఆగ్రహం

మరిన్ని వార్తలు