Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం.. పోలీసుల దాడి

15 Jun, 2022 07:30 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

మియాపూర్‌: గుట్టుచప్పుడు కాకుండా ఓ అపార్ట్‌మెంట్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను, ఇద్దరు మహిళలను మియాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌ గోకుల్‌ ప్లాట్స్‌లోని ప్రభా సాయిధరమ్‌ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఓటీ, మియాపూర్‌ పోలీసులు అపార్ట్‌మెంట్‌లో మంగళవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు.

అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విశాఖపట్నం చిన్నజాగ్‌రావుపేటకు కిష్టాఫర్‌ సన్నీ(25), చెలమ భరత్‌ (35), మరో ఇద్దరు మహిళలను గుర్తించారు. మహిళలను రెస్క్యూ హోంకు తరలించగా కిష్టాఫర్‌ సన్నీ, చెలమ భరత్‌లను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ వ్యభిచారం నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చదవండి: (ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌ వివాదం.. నవ వధువు ఆత్మహత్య) 

మరిన్ని వార్తలు