మిర్చి తోటలో నీరు పెట్టేందుకు వెళ్లిన మూగ యువతిపై అత్యాచారం

27 Nov, 2021 13:42 IST|Sakshi

సాక్షి,తిరుమలాయపాలెం(ఖమ్మం): మిర్చి తోటలో నీళ్లు పెట్టేందుకు వెళ్లిన మూగ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై బాధితురాలి తండ్రి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుబ్లేడు గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఓ మూగ యువతి గత నెల 31న మిర్చి తోటలో నీళ్లు పెట్టేందుకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న ఆమెపై అదే గ్రామానికి చెందిన ఈడబోయిన గోపి అనే కామాంధుడు గుట్టల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని కొద్ది రోజుల తర్వాత తన సోదరికి తెలపడంతో బయటపడింది. ఈ మేరకు ఎస్సై భవాని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   

మరిన్ని వార్తలు