ఫోన్‌ కొనివ్వలేదని.. విద్యార్థిని ఆత్మహత్య

18 Jan, 2021 02:54 IST|Sakshi
సింధూజ (ఫైల్‌) 

పాలకుర్తి: ఆన్‌లైన్‌ పాఠాలు వినడానికి సెల్‌ఫోన్‌ కావాలని అడగగా, తల్లిదండ్రులు కొనివ్వలేదనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్పై గండ్రాతి సతీష్‌ కథనం ప్రకారం.. శీల వెంకన్న, మంజుల దంపతుల కుమార్తె సింధూజ 9వ తరగతి చదువుతోంది. స్మార్ట్‌ఫోన్‌ లేకపోవడంతో పాఠాలకు దూరమైంది. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతూ వస్తోంది. అయితే వారు ఫోన్‌ కొనివ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం ఇంటి పరిసరాల్లో గల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మరిన్ని వార్తలు