డోన్ రూరల్(నంద్యాల జిల్లా): మండల పరిధిలోని తాటిమాన్ కొత్తూరు గ్రామానికి చెందిన ట్రాన్స్జెండర్ బాలవినోదన్ బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. బంధువులు తెలిపిన వివరాలు.. బాలవినోదన్ కొంతకాలంగా డోన్ పట్టణంలోని వైఎస్ నగర్లో బంధువుల వద్ద ఉంటోంది.
ఉదయం ఇంట్లోనే పురుగు మందు తాగింది. గమనించిన బంధువులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్లు కర్నూలుకు రెఫర్ చేశారు.