ఎస్‌ఈబీ స్టేషన్‌పై ఉన్మాది దాడి

19 Mar, 2023 02:20 IST|Sakshi
ఉన్మాది చేతిలో ధ్వంసమైన ప్రత్తిపాడు ఎస్‌ఈబీ వాహనం

ప్రత్తిపాడు: స్థానిక స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) స్టేషన్‌పై శనివారం తెల్లవారుజామున ఉన్మాది దాడి చేశాడు. ఎస్‌ఈబీ పోలీసుల కథనం మేరకు స్థానిక ఎస్‌ఈబీ స్టేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న పెండ్యాల పార్వతి కుమారుడు శ్రీను గత రాత్రి బంధువుల గృహ ప్రవేశ వేడుకకు హాజరై, మద్యం మత్తులో ఎస్‌ఈబీ కార్యాలయానికి అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చి గేటు తీయమంటూ నానా యాగీ చేశాడు. సెంట్రీ డ్యూటీలో ఉన్న సవలం చిన్నప్ప దొరను బూతులు తిడుతూ, గేటు దూకి కత్తితో చిన్నప్పదొరను బెదిరించాడు. దీంతో చిన్నప్పదొర స్టేషన్‌ లోపలికి పోయి తలుపులు బిడాయించుకున్నాడు. దీంతో శ్రీను ఎస్‌ఈబీ జీపు అద్దాలను పగులగొట్టి, కేసులో పట్టుబడిన ద్విచక్ర వాహనాన్ని తోసివేసి, అరటి చెట్టును ధ్వంసం చేసి వెళ్లిపోయాడు. దీనిపై సవలం చిన్పప్పదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్తిపాడు ఎస్సై ఎం.పవన్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు