అప్పనపల్లి.. ఆధ్యాత్మికతతో శోభిల్లి | Sakshi
Sakshi News home page

అప్పనపల్లి.. ఆధ్యాత్మికతతో శోభిల్లి

Published Sun, Dec 17 2023 10:34 AM

బాలబాలాజీ స్వామి సన్నిధిలో భక్తులు  - Sakshi

మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి ఆలయం శనివారం ఆధ్యాత్మికతతో శోభిల్లింది. గోవిందనామ స్మరణతో మార్మోగింది. వేలాదిగా వచ్చిన భక్తులు ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారికి తలనీలాలు, ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఏడు ప్రదక్షిణలు చేసి, కోర్కెలు నెరవేరాలని వేడుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి రూ.2.03 లక్షల ఆదాయం సమకూరింది. లడ్డూ ప్రసాదం, దర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.1.49 లక్షలు, నిత్యాన్నదానానికి రూ.53,244 విరాళంగా వచ్చాయి. 2,985 మంది స్వామివారిని దర్శించుకోగా, 2,163 మంది అన్న ప్రసాదం స్వీకరించారని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ చిట్టూరి రామకృష్ణ, ఈఓ జి.శ్రీదేవి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement