పోటెత్తిన అన్నవరప్పాడు ఆలయం | Sakshi
Sakshi News home page

పోటెత్తిన అన్నవరప్పాడు ఆలయం

Published Sun, Dec 17 2023 10:36 AM

అన్నవరప్పాడులో విశేష అలంకరణలో వేంకటేశ్వరస్వామి  - Sakshi

పెరవలి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో ద్వారకా తిరుమలగా పేరుగాంచిన అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే మహిళా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 7 తర్వాత ఆలయానికి వేలాదిగా భక్తులు రావటంతో దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. భక్తులకు ఉచిత ప్రసాదాల పంపిణీతో పాటు ఉదయం 10 నుంచి అన్న సమారాధన నిర్వహించారు. దాత సాపిరెడ్డి వెంకటేశ్వరరావు, సత్యవేణి దంపతులు దీనిని ప్రారంభించారు. సుమారు 4 వేల మంది భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement