నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసరావు ఎన్నిక య్యారు. శుక్రవారం అరండల్పేటలో సంఘ ఆధ్వర్యంలో ధన్వంతరీ జయంతి వేడుకలను నిర్వహించడంతో పాటు నూత కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ ఉపాధ్యక్షుడిగా జి.హనుమంతరావు, కార్యదర్శిగా హరిబాబు, ట్రెజరర్గా హనుమంతరావు, కార్యవర్గ సభ్యు లుగా రామారావు, కోటేశ్వరరావులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన ఆయుర్వేదం ప్రాముఖ్యతను, పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు తగిన కృషి చేస్తామన్నారు.