● సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 10.45 గంటలకు మాచర్ల సాగర్ రోడ్డులో హెలిప్యాడ్కు హెలికాప్టర్లో చేరుకున్నారు.
● పీఆర్కే, పీవీఆర్తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
● రోడ్డు మార్గాన 3.5 కిలోమీటర్ల దూరంలోని సభాస్థలికి బస్సులో సీఎం చేరుకున్నారు.
● దారిపొడవునా ప్రజలు, మహిళలు రోడ్డుకిరువైపులా బారులు తీరి జేజేలు పలికారు.
● సభా వేదికపై వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
● దాదాపు గంటసేపు సీఎం జగన్ ప్రసంగించారు.
● దాదాపు లక్ష మంది తరలి వచ్చినట్టు అంచనా.
● 60 వేల మందితో సభా ప్రాంగణం కిక్కిరిసింది.
● వైఎస్సార్ విగ్రహం సెంటర్లో మహిళలు ఏక రూప దుస్తులు ధరించి జననేతకు హారతులు పట్టారు. గుమ్మడి కాయలతో దిష్టి తీశారు.
● సుగాలి మహిళల పాటల కోలాహలం, యువకుల బైక్ ర్యాలీలతో మాచర్ల హోరెత్తింది.
● బందోబస్తును ఎస్పీ రవిశంకర్రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.