తాడేపల్లిరూరల్ : సీతానగరం జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమంలో నిర్వహిస్తున్న 67వ తిరు నక్షత్ర వేడుకలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ సీతారామ చంద్రుల విగ్రహానికి వైభంగా ఏకోత్తర సహస్ర కలశాభిషేకం నిర్వహించామని తెలిపారు. 1993లో సీతారామచంద్రుల విగ్రహాన్ని కొంతమంది దొంగలు దొంగిలించారని, ఆనాటి కాలంలో పోలీస్ అధికారిగా వున్న కోటేశ్వరరావు ఆ విగ్రహాన్ని వెతికి తీసుకువచ్చారని తెలిపారు. అలా తిరిగి వచ్చిన విగ్రహానికి సీతానగరం చిన జీయర్స్వామి ఆశ్రమంలో కలశాభిషేకం నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందారని ఆయన తెలిపారు.