జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు ప్రదానం

23 Jan, 2022 14:54 IST|Sakshi

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని నేతాజీ రీసెర్చ్ బ్యూరో.. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకు "నేతాజీ అవార్డు 2022"ను ప్రదానం చేసింది. ఈ మేరకు కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్‌లో ఉన్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నివాసంలో ఆదివారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో నేతాజీ అవార్డు 2022ను అబేకు ప్రదానం చేస్తున్నట్లు నేతాజీ రీసెర్చ్‌ బ్యూరో తెలిపింది. 

అయితే ఈ అవార్డును కోల్‌కతాలోని జపాన్‌ కాన్సుల్‌ జనరల్ నకమురా యుటాకా అబే తరపున ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ న్యూఢిల్లీ నుంచి ప్రసంగించారు.  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడి మనవడు, నేతాజీ రీసెర్చ్ బ్యూరో డైరెక్టర్ అయిన సుగతా బోస్, అబేను నేతాజీకి గొప్ప ఆరాధకుడిగా అభివర్ణించారు.

(చదవండి: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి.. నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని)

మరిన్ని వార్తలు