పాక్‌ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ 

27 Dec, 2023 01:35 IST|Sakshi

పెషావర్‌: ముస్లింల ఆధిపత్యముండే పాకిస్తాన్‌లో ఫిబ్రవరిలో జరగబోయే దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలిసారిగా ఒక హిందూ మహిళ పోటీకి నిలబడింది. ఖైబర్‌ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలోని పీకే–25 పార్లమెంట్‌ స్థానం నుంచి సవీరా పర్కాశ్‌ అనే మహిళ పోటీచేస్తున్నారు.

హిందువు అయిన సవీరా వృత్తిరీత్యా వైద్యురాలు. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పారీ్ట(పీపీపీ) తరఫున బునేర్‌ జిల్లాలో ఆమె నామినేషన్‌ దాఖలుచేశారు. 

>
మరిన్ని వార్తలు