ఖలీల్వాడి: నగరంలోని ఓ వృద్ధుడు కుటుంబ కలహాలు, అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని దుబ్బ ఏరియాలో యాదగిరి(76) నివసిస్తుండేవాడు. కుటుంబంలో కలహాలు రావడం, ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బుధవారం ఇంట్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మోపాల్లో వివాహిత..
మోపాల్: మండలంలోని మోపాల్ గ్రామంలో ఓ వివాహిత బుధవారం కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. బోనాలకు చెందిన లావణ్య(30)కు, మోపాల్కు చెందిన మోహన్కు పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. లావణ్య బీడీ కార్మికురాలు కాగా, భర్త ఆటో నడుతుంటాడు. ఇటీవల భార్యభర్తల మధ్య గొడవలు జరగడంతో, లావణ్య ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.