వందశాతం ఉత్తీర్ణత సాధించాలి | Sakshi
Sakshi News home page

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

Published Fri, Nov 24 2023 1:18 AM

ప్రత్యేక తరగతులను పరిశీలిస్తున్న డీఈవో - Sakshi

మోపాల్‌: జిల్లాలో పదో తరగతి ఫలితాల్ల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు ప్రణాళికలు రూపొందించుకోవాలని డీఈవో దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు. నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ప్రత్యేక తరగతులను గురువారం పరిశీలించారు. ప్రత్యేక తరగతుల్లో అర్థం కాని విషయాలు, సందేహాలను విద్యార్థులు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. పాఠశాలలో మొత్తం 245 మంది విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు హెచ్‌ఎం శంకర్‌ తెలిపారు. డీఈవో వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement
Advertisement