రూ.13 లక్షల గంజాయి స్వాధీనం

30 Mar, 2023 00:46 IST|Sakshi
గంజాయితో నిందితురాలు నగ్మా

దొడ్డబళ్లాపురం: బెంగళూరు కళాసి పాళ్య పోలీసులు ఓ మహిళను అరెస్ట్‌ చేసి రూ.13లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నగ్మా అనే మహిళ తన భర్తతో కలిసి గంజాయి విక్రయిస్తోంది. పిల్లలను రైళ్లలో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి వారి ద్వారా గంజాయిని నగరానికి తీసుకొచ్చేవారు. ఈక్రమంలో ఆరు నెలల క్రితం గంజాయి విక్రయిస్తూ నగ్మ భర్త పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా నగ్మా కలాసిపాళ్య కార్నేషల్‌ సర్కిల్‌లో గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేశారు. నగ్మను అరెస్ట్‌ చేసి రూ.13 లక్షల విలువైన 26కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్‌
బనశంకరి:
కాలేజీ వద్ద గంజాయి విక్రయిస్తున్న అనేకల్‌ సోమశేఖర్‌, రాఘవేంద్ర అనే ఇద్దరు డ్రగ్స్‌పెడ్లర్లను బుధవారం అనేకల్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.15 లక్షల విలువచేసే 25 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదుచేసి విచారణచేపడుతున్నారు.

మైసూరు: మడికేరిలో గంజాయి విక్రయస్తున్న అసోంకు చెందిన సైపుల్‌ ఇస్లాం(28), అనార్‌ హుస్సేన్‌(37), జహీర్‌ అలీ(28)ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 2.151 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు