హోసూరు దగ్గర ఏనుగుల దండు | Sakshi
Sakshi News home page

హోసూరు దగ్గర ఏనుగుల దండు

Published Thu, Mar 30 2023 12:46 AM

సూతాళం వద్ద మకాం వేసిన ఏనుగులు  - Sakshi

హోసూరు: బెంగళూరు బన్నేరుగట్ట అటవీ ప్రాంతం నుంచి ఆనేకల్‌ అటవీ ప్రాంతం మీదుగా ఐదు ఏనుగులు హోసూరు సమీపంలోని సూతాళం గ్రామం వద్దకు చేరుకొన్నాయి. ఏనుగులను చూసేందుకు స్థానిక ప్రజలుపోటెత్తారు. ఈ ఐదు ఏనుగులు కుమారనపల్లి, చూడుగొండపల్లి ప్రాంతాలకు చేరుకొని ఆ ప్రాంత రైతులు పండిస్తున్న పంటలను ధ్వంసం చేస్తున్నాయి. రైతులు అటవీ శాఖాధికార్లకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగుల సంచారంపై నిఘా పెట్టారు. హోసూరు కార్పొరేషన్‌ సరిహద్దులో ఏనుగులు సంచరిస్తున్నట్లు తెలుసుకొన్న స్థానిక ప్రజలు ఏనుగులను చూసేందుకు పోటెత్తారు.

మొక్కలు నాటుతున్న దృశ్యం
1/1

మొక్కలు నాటుతున్న దృశ్యం

Advertisement

తప్పక చదవండి

Advertisement