ఆర్థిక సంవత్సరంముగుస్తుండగాహడావుడి..

23 Mar, 2023 01:12 IST|Sakshi

ఈ గణాంకాలను బట్టి పరిస్థితిని పరిశీలిస్తే మూడు మున్సిపాలిటీలలో సిబ్బంది అలసత్వం, అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొన్ని రోజుల ముందు మాత్రమే వసూ ళ్లపై హడావుడి చేయడం గమనార్హం. ఒకవైపు ఉన్నతాధికారులు గడువులోపు లక్ష్యాన్ని చేరుకోవాల ని హెచ్చరిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ మేరకు అమలు కావడం లేదు.

ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తున్నారు

కొన్ని నెలలుగా మా సిబ్బంది ఇంటింటికీ తిరిగి కొళాయి–నల్లా బిల్లులను వసూలు చేస్తున్నారు. ఈ వారం రోజుల్లో సాధ్యమైనంత వరకు లక్ష్యం చేరుకోవడానికి యత్నిస్తాం. ప్రజలందరూ పన్నులు కట్టి పురపాలిక అభివృద్ధికి సహకరించాలి.

– డి.ప్రదీప్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, మహబూబ్‌నగర్‌

మరిన్ని వార్తలు